Header Banner

దద్దరిల్లిన పెద్ద ధన్వాడ.. పరిశ్రమను వ్యతిరేకిస్తూ రైతుల ఆందోళన, వాహనాలు ధ్వంసం!

  Wed Jun 04, 2025 16:40        Politics

జోగులాంబ గద్వాల జిల్లా, రాజోలి మండలంలోని పెద్ద ధన్వాడ వద్ద ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటు వ్యవహారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న రైతులు బుధవారం ఆందోళనను ఉద్ధృతం చేసి, నిర్మాణ ప్రాంతంలోకి చొచ్చుకెళ్లి విధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. పెద్ద ధన్వాడ వద్ద గాయత్రి కంపెనీ ఇథనాల్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే, ఈ పరిశ్రమ ఏర్పాటును స్థానిక రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దాదాపు 12 గ్రామాల ప్రజలు ఈ ఆందోళనలో పాలుపంచుకుంటున్నారు. మంగళవారం కంపెనీ ప్రతినిధులు పరిశ్రమ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కూలీలను తీసుకురావడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది.

 

ఇది కూడా చదవండి: ఆ ఘనత జగన్‌కే సొంతం.. సోమిరెడ్డి సెటైర్! సంబంధం లేని కేసులో..

 

ఈ నేపథ్యంలో, బుధవారం ఉదయం పెద్ద ఎత్తున రైతులు, మహిళలు పరిశ్రమ ఏర్పాటు చేయతలపెట్టిన ప్రాంతానికి చేరుకున్నారు. పోలీసుల బందోబస్తు ఉన్నప్పటికీ, ఆందోళనకారులు నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన టెంట్లను పీకివేశారు. అక్కడున్న సామగ్రిని ధ్వంసం చేశారు. పనులు చేసేందుకు వచ్చిన కూలీలను రాళ్లతో తరిమికొట్టడంతో వారు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనతో పెద్ద ధన్వాడలో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రైతులను శాంతింపజేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అయినప్పటికీ, రైతులు తమ ఆందోళన విరమించేది లేదని, పరిశ్రమ ఏర్పాటును అడ్డుకుని తీరుతామని స్పష్టం చేస్తుండటంతో ఉద్రిక్తత కొనసాగుతోంది.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!

 

యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్ల‌కి కట్టినట్లుగా..

 

యూఏఈ గోల్డెన్ వీసా.. ట్రంప్ గోల్డెన్ వీసా...! రెండింట్లో ఏది బెటర్?

 

ఎర్రగడ్డ మానసిక చికిత్స కేంద్రంలో ఫుడ్ పాయిజన్! ఒకరి మృతి... అసలు కారణం ఇదే!

 

ఏపీలో రైలు ప్రయాణికులకు గమనిక..! ఈ 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు అదనపు బోగీలు!

 

ఏపీలో అక్కడ కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్..! ఏకంగా 5వేల ఎకరాల్లో, ఆ ప్రాంతానికి మహర్దశ!

 

ఏపీలో ఆ ప్రభుత్వ ఉద్యోగులందరికి ప్రమోషన్లు..! మొత్తానికి కల నెరవేరింది, బదిలీలు కూడా..!

 

వర్చువల్ సిస్టమ్‌ వినియోగదారులకు షాక్! మైక్రోసాఫ్ట్ తాజా అప్‌డేట్ లో లోపం!

 ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #RajoliEthanolPlant #RajoliEthanol #plantprotest #JogulambaGadwal #PeddaDhanwada